Baba Vanga Gold Prediction for 2026 : అయ్యా.. బాబోయ్.. బంగారం.. ఇక కొనడం కలేనా.. భవిష్యత్తులో బంగారాన్ని సామాన్యులు కొనలేరా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల బంగారంపై బాబా వంగా చెప్పిన జోస్యం సంచలనం రేకితిస్తోంది. బంగారం ధరలపై బాబా వంగా అంచనాలు బంగారం ప్రియులను షాకింగ్ గురిచేస్తున్నాయి. ఇప్పటికే బంగారం ధరల పెరుగుదలతో బెంబేలిత్తిపోతున్న సామాన్యులకు బాబా వంగా అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
వచ్చే ఏడాది 2026లో బంగారం ధరలు (Baba Vanga Gold) అమాంతం పెరిగిపోతాయని ఆకాశాన్నింటుతాయని అంటున్నారు. బంగారం పెరుగుదలతో ప్రపంచ భవిష్యత్తు ఏంటి? ఎలాంటి విపత్తు సంబవించబోతుందనే భయాందోళనలు నెలకొన్నాయి.
Baba Vanga Gold : గ్రహాంతరవాసులతో సంబంధాలు :
2026 సంవత్సరంలో బంగారం ధరలపై బాబా వంగా చెప్పినాలు అంచనాలు నిజమవుతాయా? ఇప్పుడు ఇది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అంతేకాదు.. 2025లోనే గ్రహాంతరవాసులతో సంబంధాలు ఏర్పడవచ్చని బాబా వంగా అంచనా వేశారు. దీనికి సంబంధించిన ఒక షాకింగ్ సంఘటన 2026లో జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన వివాదాస్పద అంచనాలతో మరోసారి బాబా వంగా వెలుగులోకి వచ్చారు. 1911లో బల్గేరియాలో జన్మించిన బాబా వంగా 1996లో మరణించారు. ఈ గొప్ప ప్రవక్త తన జీవితకాలంలో అనేక అంశాలపై భారీగా అంచనాలు వేశారు. అందులో చాలావరకూ నిజమయ్యాయని చారిత్రక ఉదాహరణలు ఉన్నాయి.
బాబా వంగా బల్గేరియాకు చెందిన అంధ జ్యోతిష్కుడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. 1996లో 86 ఏళ్ల వయసులో మరణించే ముందు ఆమె 5079 సంవత్సరం వరకు అనేక అంచనాలు వేశారు. బాబా వంగా చెప్పిన అనేక అంచనాలలో కొన్ని తర్వాతి సంఘటనలతో ముడిపడి ఉంటాయి.
ప్రకృతి వైపరీత్యాలపై అంచనాలు :
బాబా వంగా పేరుతో వివిధ అంచనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో 9/11 దాడి, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అవుతారనే అంచనాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రజల దృష్టి ఆమె భవిష్యత్ అంచనాలపైకి ఆకర్షితులవుతోంది.
బాబా వంగా 2025 సంవత్సరానికి 2024లోనే కొన్ని అంచనాలను రాశారు. 2025లో గ్రహాంతరవాసులతో (Baba Vanga Gold Prediction) సంబంధం ఏర్పడవచ్చునని పేర్కొన్నారు. అంతేకాదు.. 2025లో మానవులు గ్రహాంతరవాసుల జాడను కనిపెడతారని కూడా తెలిపారు. అయితే, దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా మన గెలాక్సీలో ఒక మర్మమైన అంతరిక్ష నౌక శాస్త్రవేత్తలను ఇప్పటికీ అయోమయంలో పడేస్తోంది.
అంతరిక్షంలో కనిపించే ఈ వస్తువు మాన్హట్టన్ పరిమాణంలో ఉంటుందని అంటున్నారు. దాదాపు 33 బిలియన్ టన్నుల బరువు కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నికెల్ టెట్రాకార్బొనిల్ను విడుదల చేస్తుందట.

ఇంతకు ముందు ఏ తోకచుక్కలోనూ కనిపించని పదార్థం ఇందులో ఉందని గుర్తించారు. హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఇది ఒక వస్తువు కాకపోవచ్చనని అంచనా వేశారు. కానీ, గ్రహాంతర టెక్నాలజీతో కూడిన అంతరిక్ష నౌక కావచ్చు అని గట్టిగానే వాదన వినిపించారు.
మరోవైపు.. శాస్త్రవేత్తలు ఈ ఇంటర్స్టెల్లార్ వస్తువుకు (3I/ATLAS) అని పేరు పెట్టారు. డిసెంబర్ 19న 3I/ATLAS భూమికి దగ్గరగా ఉంటుంది. భూమి నుంచి కనీసం 240 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉందని, ప్రస్తుతానికి భూమికి ఎలాంటి ముప్పు లేదని నాసా (NASA) పేర్కొంది.
ఈ సంఘటనతో ప్రజలు గ్రహాంతరవాసుల గురించి బాబా వంగా అంచనాలతో ముడిపెడుతున్నారు. గ్రహాంతరవాసులతో పాటు 2026 నాటికి బాబా వంగా పెరుగుతున్న బంగారం ధరలు, అంతర్యుద్ధం, ఆర్థిక ఇబ్బందులు, నగదు కొరత గురించి కూడా గట్టిగా హెచ్చరించారు.
బాబా వంగా అంచనాలకు తగినట్టుగానే బంగారం ధరలు నిరంతరం హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి. ఇటీవలే బంగారం ధరలు రికార్డు స్థాయిల నుంచి 10 గ్రాములకు సుమారు రూ. 1, 22,000కి పడిపోయాయి. అయితే, పెట్టుబడిదారుల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే..
2026లో బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా? బంగారం మరింత ఖరీదైనదా లేదా చౌకగా మారుతుందా? బల్గేరియన్ బాబా వంగా చెప్పిన జోస్యం పెట్టుబడిదారులను బంగారు ఔత్సాహికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Baba Vanga Gold : బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పైపైకి..
అక్టోబర్ 2025 నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్నాక బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన అవకాశంగా భావించారు. అయితే, ఇటీవల గత రెండు రోజులుగా బంగారం ధరలు మళ్లీ పెరగడం మొదలైంది. బాబా వంగా అంచనా పెట్టుబడిదారులకు మరింత ముఖ్యమైనదిగా మారింది.
బాబా వంగా గత అంచనాలివే :
బాబా వంగా బల్గేరియన్ అంధ జ్యోతిష్కుడు.. గతంలో ఆమె అనేక అంచనాలు నిజమయ్యాయి. ఆమె ట్విన్ టవర్స్ ఉగ్రవాద దాడిని అంచనా వేసింది. యువరాణి డయానా మరణం గురించి కూడా కచ్చితమైన అంచనాలు కాలక్రమేణా నిజమయ్యాయి. మయన్మార్ భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ఆమె అంచనాలు ఖచ్చితమయ్యాయి.
అయితే, బాబా వంగా అంచనాలు సాధారణంగా ప్రత్యక్ష సంఘటనలను వివరించవు. కానీ, ఆమె సూచనలు, దిశను సూచిస్తాయి. అదేవిధంగా, బంగారం ధరలకు సంబంధించి ఆమె అంచనాలు పరోక్షంగా ఉంటాయి.
బాబా వంగా 2025లో ప్రపంచ యుద్ధం వస్తుందని అంచనా వేసింది. అది కూడా నిజంగానే జరిగింది. ఈ ఏడాదిలో భారత్-పాకిస్తాన్, పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్-ఇరాన్, థాయిలాండ్-కంబోడియా మధ్య యుద్ధాలు జరిగాయి. అయితే, ఈ ఘర్షణలన్నింటిలోనూ కాల్పుల విరమణలు అమలు కావడం విశేషం.
బాబా వంగా ఒక మహిళ :
బాబా వంగా అనేది ఒక మహిళ అని చాలా మందికి తెలియకపోవచ్చు. బాబా వంగా అసలు పేరు వాంజెలియా పాండేవా గుష్టెరోవా. అక్టోబర్ 3, 1911న ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఆమె జన్మించారు. బాబా వంగా 12 ఏళ్ల వయసులో కంటి చూపు కోల్పోయారు. ఆమె ఆగస్టు 11, 1996న బల్గేరియాలో 84 ఏళ్ల వయసులో మరణించారు.
2026లో బంగారం ధరలపై భారీ అంచనాలు :
నివేదికల ప్రకారం.. బాబా వంగా అంచనా బంగారం ధరలకు నేరుగా సంబంధించినది కాదని గమనించాలి. 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని బాబా వంగా అంచనా సూచిస్తుంది. ఈ అంచనా ఒకవేళ నిజమైతే.. నగదు కొరత బ్యాంకింగ్ వ్యవస్థలో తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.
అలాంటి సమయాల్లో బంగారంలో పెట్టుబడి పెట్టడాన్ని సురక్షితమైనదిగా భావిస్తారు. ఫలితంగా, బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షలకు చేరుకోవచ్చు. ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరినట్టే.
బంగారంపై పెట్టుబడిదారులకు సంకేతాలివే :
బాబా వంగా అంచనా ప్రకారం.. రాబోయే ఆర్థిక సంక్షోభం బంగారం ధరలను భారీగా పెంచుతుంది. పెట్టుబడిదారులు తమ బంగారు పెట్టుబడులను పెంచుకోవడానికి తమ సేవింగ్స్ భద్రపరచుకునేందుకు ఇదొక అద్భుతమైన అవకాశం కావచ్చు. అయితే, బాబా వంగా అంచనాలు ఎల్లప్పుడూ సూచనాత్మకమైనవి మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.

బంగారంలో పెట్టుబడి పెట్టే ముందు.. మార్కెట్ ట్రెండ్లు, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని, ఆర్థిక సలహాదారుని సంప్రదించడం ముఖ్యమని సూచిస్తున్నారు. బంగారంపై బాబా వంగా అంచనాలను పరిశీలిస్తే.. 2026లో బంగారం ధరలు భారీగా పెరగవచ్చు. పెట్టుబడిదారులు ఈ సూచనను పరిగణనలోకి తీసుకొని తెలివిగా పెట్టుబడి పెట్టడం ఎంతైనా మంచిది.
వచ్చే దీపావళి నాటికి బంగారం ధర ఎంత పెరగొచ్చంటే? :
బంగారం ధరలపై అనేక ఊహాగానాలు నెలకొన్నాయి. ద్రవ్యలోటు లేకపోవడం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్థిక మాంద్యం సమయంలో బంగారం సాధారణంగా అత్యంత ఖరీదైనదిగా మారుతుంది. గత ప్రపంచ సంక్షోభాల సమయంలో కూడా బంగారం ధర 20 శాతం నుంచి 50 శాతం పెరిగింది.
2026లో ఏదైనా ఆర్థిక సంక్షోభం ఏర్పడితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం ధర 25 శాతం నుంచి 40 శాతం వరకు పెరగవచ్చు. అదేగానీ జరిగితే వచ్చే దీపావళి నాటికి భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500 నుంచి రూ.1,82,000 మధ్య ఉంటుంది. మరో సరికొత్త రికార్డు నమోదవుతుంది.
ప్రపంచ అల్లకల్లోలాల మధ్య బంగారం పెరుగుదల :
బంగారం ధరల పెరుగుదలకు అంతర్జాతీయంగా అనేక పరిణామాలు కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక అస్థిరత భయాలు పెట్టుబడిదారులను బంగారం వంటి సురక్షితమైన ఆస్తుల వైపు పెట్టుబడి పెట్టేలా ప్రేరేపిస్తున్నాయి. సుంకాల గురించి ఊహాగానాలు, కరెన్సీ అస్థిరత, ప్రపంచ వృద్ధి మందగించడం కూడా రిస్క్ అవగాహనలను పెంచుతున్నాయి. బంగారు లోహానికి బలమైన డిమాండ్ను ప్రేరేపిస్తోంది.
2026 బంగారం ధర లక్ష్యాలివే :
బాబా వంగా అంచనాల ప్రకారం.. ప్రపంచం తీవ్ర నగదు కొరతను ఎదుర్కోబోతుంది. బ్యాంకింగ్ లేదా ద్రవ్య సంక్షోభం వైపు పయనించవచ్చు. దాంతో ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుంది. చారిత్రాత్మకంగా, ఇలాంటి తిరోగమనాల సమయంలో బంగారం బలంగా దూసుకుపోతుంది.
పెట్టుబడిదారులు, వినియోగదారులపై ప్రభావం ఏంటి? :
పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అనిశ్చిత సమయాల్లో బంగారం వ్యూహాత్మక హెడ్జ్గా మారుతుంది. రోజువారీ వినియోగదారులకు ముఖ్యంగా భారత్ వంటి బంగారానికి విలువ ఇచ్చే సంస్కృతిలో రాబోయే సంవత్సరంలో బంగారం ధరలు కొనుగోలు అలవాట్లు, బహుమతి సంప్రదాయాలు, దీర్ఘకాలిక సేవింగ్స్ ప్లాన్లపై తీవ్ర ప్రభావితం చూపవచ్చు.
అయితే, బంగారం ప్రియులతో పాటు బంగారంపై భారీగా పెట్టుబడిపెట్టేవాళ్లు చాలా జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భారీ అంచనాలు మార్కెట్ ఊహాగానాలతో అనుగుణంగా ఉంటాయి. పెట్టుబడిదారులు తమ నిర్ణయాలను కేవలం అంచనాలపై ఆధారపడకుండా ఆర్థిక ప్రాథమిక అంశాలు, ద్రవ్యోల్బణ డేటా, భవిష్య రాజకీయ పరిస్థితులపై ఆధారపడాలని ప్రోత్సహిస్తోంది.
ప్రపంచ ఆర్థిక జలాలు అనిశ్చితంగా మారిపోతున్న తరుణంలో సురక్షితమైన ఆస్తిగా బంగారం ఎప్పుడూ చెక్కుచెదరకుండా అలానే ఉంటుంది. ధర పెరుగుతున్న కొద్ది బంగారం విలువ కూడా అంతే స్థాయిలో పెరుగుతూ పోతుంది. 2026కి నాటకీయ బంగారం పెరుగుదల అంచనా నిజమవుతుందో లేదో ఇంకా తెలియదు. కానీ, ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ప్రపంచ సంక్షోభ సమయాల్లో కూడా బంగారం ధరలతో మరింత డిమాండ్ పెరగడం ఖాయం.
FAQs : 2026లో బంగారం ధరలు పెరుగుతాయా? బాబా వంగా అంచనాలివే
2030లో బాబా వంగా ఏం ఊహించింది?
బాబా వంగా 'బాల్కన్ల నోస్ట్రాడమస్' 2030లో అంచనాలు రేకిత్తిస్తున్నాయి. ఆర్థిక పతనం, ప్రకృతి వైపరీత్యాలు, 2025 నాటికి తక్కువ జనాభా కలిగిన యూరప్ వంటి అంచనాలు ఉన్నాయి. ప్రపంచ ఆకలి అంతం వంటి వైద్య పురోగతులను అనేక అంచనాలు సూచిస్తున్నాయి.
2026లో బంగారం ధర ఎలా ఉంటుంది?
2026 ఏడాదిలో బంగారం ధరలు సగటున 4,275 డాలర్లుగా ఉంటాయని అంచనా. 3 నెలల క్రితమే 3,400 డాలర్ల నుంచి భారీగా పెరిగింది. బంగారం వరుసగా రికార్డు గరిష్టాలను తాకింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 4,000/oz డాలర్ల మార్కుతో 54 శాతంగా లాభపడింది. 1979 చమురు సంక్షోభం తర్వాత బంగారం మరింత బలపడింది.
బాబా వంగా 2025లో ఏం ఊహించింది?
2025లో ప్రకృతి వైపరీత్యాలు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, సామాజిక తిరుగుబాట్లు వంటి ప్రధాన సంఘటనలను బాబా వంగా అంచనా వేసింది. ఆమె కచ్చితత్వం, దూరదృష్టితో ప్రపంచవ్యాప్తంగా సమకాలీన సంస్కృతి , మీడియాపై ప్రభావంపై అనేక చర్చలను లేవెనెత్తింది. ముఖ్యంగా 9/11 దాడులు, జలాంతర్గామి విపత్తు, బరాక్ ఒబామా ఎన్నిక, యువరాణి డయానా మరణం వంటివి ఉన్నాయి. సంఘటనలు జరగడానికి ముందు బాబా వంగా అనేక అంచనాలకు లిఖితపూర్వక రికార్డులు అందుబాటులో లేవు.
బాబా వంగా భవిష్యత్తు చూడగలరా?
బాబా వంగా బల్గే ఆధ్యాత్మికవేత్త భవిష్యత్తు గురించి వింతైన అంచనాలకు ప్రసిద్ధి చెందింది. ఆమె బాల్యం నుంచి అంధురాలు. దివ్యదృష్టి గల ఆమె భవిష్యత్తులో చాలా దూరం చూడగలదని అంటారు.
Disclaimer : బాబా వంగా బంగారం ధరల అంచనాలకు సంబంధించి ఈ స్టోరీ కేవలం సోషల్ మీడియాలో వస్తున్న వైరల్ వార్తల ఆధారంగా అందించడం జరిగింది. ReadTeluguVoice.com బాబా వంగా అంచనాను నిర్ధారించలేదని గమనించాలి.








